ఆరంభం అదిరింది

10 Jul, 2016 04:03 IST|Sakshi

ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 108/0
బసెటెర్రె (సెయింట్ కిట్స్): వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టుకు మంచి ఆరంభం లభించింది. వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరుగుతున్న రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు కడపటి వార్తలు అందే సమయానికి భారత్  వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (51; 7 ఫోర్లు), లోకేశ్ రాహుల్ (50; 5 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీలు చేసి రిటైరయ్యారు. కోహ్లి, పుజారా క్రీజులో ఉన్నారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు భారత్, రెండో రోజు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ బ్యాటింగ్ చేస్తాయి.

Election 2024

మరిన్ని వార్తలు