టి20 ప్రపంచకప్ తర్వాత పూర్తిస్థాయి కోచ్: ఠాకూర్

19 Jan, 2016 02:46 IST|Sakshi
టి20 ప్రపంచకప్ తర్వాత పూర్తిస్థాయి కోచ్: ఠాకూర్

స్వదేశంలో మార్చిలో జరిగే టి20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టుకు పూర్తిస్థాయి కోచ్‌ను నియమిస్తామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. కోచ్ ఎంపికలో సలహా కమిటీ సభ్యులు సచిన్, లక్ష్మణ్, గంగూలీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఏడాదిన్నరకు పైగా జట్టు డెరైక్టర్‌గా పని చేస్తున్న రవిశాస్త్రి టి20 ప్రపంచకప్ వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆస్ట్రేలియా నుంచి భారత క్రికెటర్లు తిరిగి వచ్చాక డీఆర్‌ఎస్‌పై వారితో మాట్లాడతామని ఠాకూర్ చెప్పారు.

మరిన్ని వార్తలు