సాక్షి, కోల్కతా: టెస్టు సిరీస్ను ఏకపక్షంగా గెల్చుకుని, వన్డే సిరీస్ను ఒడిసిపట్టిన టీమిండియా.. టీ20 సిరీస్లోనూ వెస్టిండీస్తో అమీ-తుమీకి భారత్ సిద్ధమైంది. ఈ మేరకు మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారమిక్కడి ఈడెన్ గార్డెన్స్లో రెండు జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఫీల్డింగ్ ఎంచుకున్నారు. తమ ఆటతీరుకు సరితూగే పొట్టి ఫార్మాట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన విండీస్ జట్టుకు ఈ సిరీస్ అత్యంత కఠినమైనదే. పైగా ఈసారి దాదాపు చాలామంది కొత్తవారితో ఆడుతోంది. తొలుత బ్యాటింగ్కు దిగిన విండీస్ జట్టు భారత్కు 110 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్ అప్డేట్స్ ఇవి..
ధాటిగా ఆడుతున్న విండీస్ ఆటగాడు ఫాబియన్ అలెన్(20 బంతుల్లో 27 పరుగులు) ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి విండీస్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది.
ఇప్పటికే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ విండీస్ మరో వికెటు కోల్పోయింది. 11 బంతుల్లో 4 పరుగులు చేసిన బ్రాత్వైటు కుల్దీప్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మొత్తంగా 4 ఓవర్లలో 13 పరుగులిచ్చిన కుల్దీప్ 3 వికెట్లు తీశాడు. 15 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 7వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది.
డారెన్ బ్రావోను పెవిలియన్కు పంపిన కుల్దీప్ యాదవ్కు.. మరో వికెట్ లభించింది. కుల్దీప్ వేసిన 13 ఓవర్లో 3 బంతికి రావ్మన్ పావెల్(4) ఔటయ్యాడు. దీంతో విండీస్ 13 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది.
భారత బౌలర్ల ధాటికి విండీస్ వెంటవెంటనే వికెట్లు కొల్పోతుంది. 10 ఓవర్లో కృనాల్ పాండ్యా బౌలింగ్లో కీరన్ పోలార్డ్(14) పరుగులకు ఔటవ్వగా, ఆ తర్వాతి ఓవర్లో 10 బంతుల్లో 5 పరుగులు చేసిన డారెన్ బ్రావో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ప్రస్తుతం విండీస్ 10.2 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది.
ఆదిలోనే తడబాటుకు గురయిన విండీస్కు మరో షాక్ తగిలింది. 7 బంతుల్లో 10 పరుగులు చేసిన హెట్మైర్ బుమ్రా బౌలింగ్లో జౌటవ్వడంతో.. విండీస్ కష్టాల్లో పడింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి విండీస్ మూడు వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. ప్రస్తుతం కీరన్ పోలార్డ్(4), డారెన్ బ్రావో(0) క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన విండీస్ జట్టు ఆదిలోనే తడబడింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఓపెనర్ డీ రామ్దిన్ 2 పరుగులకు ఔటవ్వగా.. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన మరో ఓపెనర్ ఎస్డీ హోప్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. దీంతో ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ ఆదిలోనే తడబాటుకు గురైంది. ఎస్డీ హోప్ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. మొత్తానికి 4.1 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది.