నిరాశ పరిచిన సాక్షి మాలిక్

17 Aug, 2016 22:01 IST|Sakshi

భారత్కు మరోసారి నిరాశే ఎదురైంది. రియో ఒలింపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్‌, వినేష్ ఫొగట్ ప్రిక్వార్టర్స్ లో శుభారంభం చేసినా, క్వార్టర్స్ లో మాత్రం వెనుకంజ వేశారు. మహిళల 58 కేజీల ప్రీ స్టైల్ విభాగంలో క్వార్టర్స్ లో రష్యాకు చెందిన రెజ్లర్ వలేరియా కోబ్లోవా భారత రెజ్లర్ సాక్షి మాలిక్ పై 3-1 తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు జరిగిన 48 కిలోల ఫ్రీ స్టైల్‌ విభాగం క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన సన్ యనన్ తో తలపడ్డ బౌట్ లో వినేష్ ఫొగట్ తీవ్రంగా గాయపడి మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు