సజన్‌కు రజతం 

19 Sep, 2018 01:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల గ్రీకో రోమన్‌ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. స్లొవేకియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో సజన్‌ భన్వాల్‌ (77 కేజీలు) రజతం... విజయ్‌ (55 కేజీలు) కాంస్యం సాధించారు. ఫైనల్లో సజన్‌ 0–8తో ఇస్లామ్‌ ఒపియెవ్‌ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. కాంస్య పతక బౌట్‌లో విజయ్‌ 16–8తో లిమాన్‌ (టర్కీ)పై గెలుపొందాడు.    

మరిన్ని వార్తలు