ద్యుతీచంద్‌కు స్వర్ణం

16 May, 2017 00:31 IST|Sakshi
ద్యుతీచంద్‌కు స్వర్ణం

న్యూఢిల్లీ: ఇండియన్‌ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్‌ మూడో అంచె పోటీల్లో ఒడిశా స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ మహిళల 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. తెలంగాణ అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్న ద్యుతీచంద్‌ సోమవారం జరిగిన ఫైనల్‌ రేసును 11.30 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మెర్లిన్‌ జోసెఫ్‌ (కేరళ–11.72 సెకన్లు) రజతం, హిమశ్రీ రాయ్‌ (బెంగాల్‌–11.95 సెకన్లు) కాంస్యం గెలిచారు. 

మరిన్ని వార్తలు