పరీక్షలు రాస్తోంది

25 Aug, 2016 00:22 IST|Sakshi
పరీక్షలు రాస్తోంది

అగర్తలా: ఆట, చదువు రెండూ ఒకే చోట పొసగవని చాలామందిలో ఓ అభిప్రాయం ఉంది. కానీ ఇది తప్పని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ నిరూపిస్తోంది. ఒలింపిక్స్ నుంచి వచ్చిన రెండో రోజే ఎం.ఎ. పొలిటికల్ సైన్స్ పరీక్ష రాసేసింది. త్రిపుర యూనివ ర్శిటీలో దీప పీజీ చదువుతోంది.

చాలా సన్మాన కార్యక్రమాలు ఉన్నా వాటిని వదిలేసి పరీక్షలకు చదువుకోవడం గొప్ప విషయమని త్రిపుర యూనివర్శిటీ అధికారులు ఆమెను ప్రశంసించారు. తోటి విద్యార్థినిలు కూడా ఆమె అంకితభావానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

 

మరిన్ని వార్తలు