భారత యువ జట్టుకు కాంస్యం

30 Oct, 2017 04:18 IST|Sakshi

న్యూఢిల్లీ: సుల్తాన్‌ జోహర్‌ కప్‌ అంతర్జాతీయ అండర్‌–21 హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు కాంస్య పతకాన్ని గెల్చుకుంది. మలేసియాలోని జోహర్‌ బాహ్రులో ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 4–0తో మలేసియాను ఓడించింది. భారత్‌ తరఫున విశాల్‌ రెండు గోల్స్‌ చేయగా... వివేక్‌ ప్రసాద్, శైలానంద్‌ లాక్రా ఒక్కో గోల్‌ సాధించారు.

మరిన్ని వార్తలు