అత్యుత్తమ ర్యాంక్‌లో భారత టీటీ జట్టు

5 Nov, 2019 10:47 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ జట్టు అత్యుత్తమ ర్యాంకుకు ఎగబాకింది. అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ప్రపంచ 30వ ర్యాంకర్‌ సత్యన్, 36వ ర్యాంకర్‌ శరత్‌ కమల్, హరీ్మత్‌ దేశాయ్‌ (104వ ర్యాంకర్‌)లతో కూడిన భారత్‌... ఆ్రస్టియాతో కలిసి పదో స్థానంలో ఉండగా... వర్గీకరణలో తొమ్మిదో ర్యాంకు దక్కింది. తొలి మూడు ర్యాంకుల్లో చైనా, జపాన్, జర్మనీ జట్లున్నాయి.  

మరిన్ని వార్తలు