రియో డి జనీరో: భారత మేటి షూటర్ జీతూ రాయ్ ఇంటర్నేషనల్ షూటింగ్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్ టోర్నమెంట్లో పేలవ ప్రదర్శన కనబరిచాడు.
బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల 50 మీ. పిస్టల్ షూటింగ్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ జీతూ రాయ్ ఆరోస్థానంలో నిలిచాడు. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో 563 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్స్కు అర్హత సాధించాడు.