బెంగళూరును గెలిపించిన సునీల్‌ చెత్రి

4 Jan, 2020 02:55 IST|Sakshi

బెంగళూరు: ఎఫ్‌సీ గోవాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కెప్టెన్ సునీల్‌ చెత్రి రెండు గోల్స్‌తో (59వ, 84వ నిమిషాల్లో) మెరిశాడు. దీంతో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ సీజన్‌–6 ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 2–1 గోల్స్‌ తేడాతో గోవాపై నెగ్గింది. గోవా తరఫున హ్యూగో (61వ నిమిషంలో) గోల్‌ సాధించాడు. నేటి మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీతో అట్లెటికో డి కోల్‌కతా తలపడుతుంది.   

మరిన్ని వార్తలు