బీసీసీఐ ఎస్‌జీఎం చెల్లదన్న సీఓఏ

29 Jun, 2018 04:49 IST|Sakshi
వినోద్‌ రాయ్‌

ఉప్పు–నిప్పుగా తయారైన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), పరిపాలక కమిటీ (సీఓఏ)ల మధ్య మరో లేఖాస్త్రం వార్తల్లోకెక్కింది. ఈ నెల 22న బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) చెల్లదని సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ క్రికెట్‌ బోర్డుకు లేఖ రాశారు. అందులో తీసుకున్న విధాన నిర్ణయాలకు విలువలేదని  ఆ లేఖలో పేర్కొన్నారు. ఎస్‌జీఎంలో క్రికెటర్ల కొత్త కాంట్రాక్ట్‌లను ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు బోర్డు ఆఫీస్‌ బేరర్లు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు