క్వార్టర్స్కు భారత ఆర్చరీ టీమ్

7 Aug, 2016 20:35 IST|Sakshi
క్వార్టర్స్కు భారత ఆర్చరీ టీమ్

భారత మహిళల ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది. రియో ఒలింపిక్స్ లో భాగంగా ఆదివారం జరిగిన ఆర్చరీ రికర్వ్ ఈవెంట్లో భారత మహిళల టీమ్ విజయం సాధించింది. కొలంబియాపై 5-3 తేడాతో గెలుపొంది భారత మహిళల జట్టు క్వార్టర్ పైనల్లోకి ప్రవేశించింది. తొలి సెట్ 52-51తో గెలిచిన దీపికా కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి బృందం రెండో సెట్ లో 49-50 తో వెనుకంజ వేసింది.

మూడో సెట్లో 52-52 తో ఇరు జట్ల స్కోరు సమం కావడంతో నిర్ణయాత్మక సెట్ నిర్వహించారు. ఈ సెట్ లో భారత్ 52 పాయింట్లు కొల్లగొట్టగా, కొలంబియా మహిళల జట్టు కేవలం 44 పాయింట్లు స్కోరు చేయడంతో ఓటమి పాలైంది. భారత మహిళల ఆర్చరీ బృందం క్వార్టర్స్ లో రష్యాతో తలపడనుంది.

మరిన్ని వార్తలు