భారత బాక్సర్ పింకీకి కాంస్యం

1 Aug, 2014 18:13 IST|Sakshi

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ల పతకాల వేట మొదలైంది. మహిళల 51 కిలోల విభాగంలో భారత బాక్సర్ పింకీ జాంగ్రా కాంస్యం నెగ్గింది. కాగా పింకీ ఫైనల్స్కు అర్హత సాధించడంలో విఫలమైంది.

శుక్రవారం జరిగిన సెమీస్లో పింకీ .. ఉత్తర ఐర్లాండ్ బాక్సర్ వాల్ష్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇదే రోజు  మరో నలుగురు భారత బాక్సర్లు సెమీస్లో తలపడనున్నారు. స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు బరిలో ఉన్నందున స్వర్ణాలు వచ్చే అవకాశముంది. ఓడినా కాంస్యం పతకం దక్కుతుంది.
 

మరిన్ని వార్తలు