విజయంతో ముగింపు

3 Mar, 2016 00:33 IST|Sakshi

 దక్షిణాఫ్రికాలో భారత మహిళల  హాకీ జట్టు పర్యటన

 స్టెలెన్‌బోష్:  దక్షిణాఫ్రికా పర్యటనను భారత మహిళల హాకీ జట్టు విజయంతో ముగించింది. స్కాట్లాండ్ జట్టుతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 3-0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున పూనమ్ రాణి రెండు గోల్స్ చేయగా... వందన కటారియా ఒక గోల్ సాధించింది. ఈ పర్యటనలో జర్మనీ, దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్ జట్లతో భారత్ మ్యాచ్‌లు ఆడింది. జర్మనీతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్ ఓడిపోయింది.

మరిన్ని వార్తలు