భారత్‌కు తొలి విజయం

6 Jun, 2017 01:01 IST|Sakshi

డసెల్‌డార్ఫ్‌ (జర్మనీ): మూడు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి విజయం దక్కింది. బెల్జియంతో సోమవారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 3–2తో గెలిచింది. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (34వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... రమణ్‌దీప్‌ సింగ్‌ (49వ నిమిషంలో) ఒక గోల్‌ అందించాడు.

మరిన్ని వార్తలు