భారత్‌కు రెండో ఓటమి

8 May, 2016 01:02 IST|Sakshi

మర్లో (ఇంగ్లండ్):  బ్రిటన్‌తో జరుగుతున్న హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌ను 0-2తో కోల్పోయిన భారత్... రెండో మ్యాచ్‌లో 1-2 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. బ్రిటన్  తరఫున లెగ్, కులెన్ ఒక్కో గోల్ చేయగా... భారత్‌కు దీప్ గ్రేస్ ఎక్కా గోల్‌ను అందించింది. ఐదు మ్యాచ్‌ల  సిరీస్‌లో భారత్ 0-2తో వెనుకబడి ఉంది.
 

>
మరిన్ని వార్తలు