తొలి మూడు వన్డేలకు డివిలియర్స్‌ దూరం

30 Jan, 2018 20:11 IST|Sakshi
గాయంతో మొదటి మూడు వన్డేలకు దూరమైన ఏబీ డివిలియర్స్‌

జోహన్నెస్‌బర్గ్‌: వన్డే సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా తొలి మూడు వన్డేలకు విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ దూరమయ్యారు. భారత్‌తో జరిగిన మూడో టెస్టులో డివిలియర్స్‌ చేతి వేలికి గాయమైంది. ఈ గాయం మానడానికి మరో రెండు వారాల సమయం పట్టవచ్చునని డాక్టర్లు తేల్చడంతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు డివిలియర్స్‌కు విశ్రాంతినిచ్చింది. 

డివిలియర్స్‌ స్థానంలో మరొకరిని ఎంపిక చేయడం లేదని బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 10న జరగబోయే పింక్‌ వన్డే(నాలుగో వన్డే) సమయానికి డివిలియర్స్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే ఆరు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే ఫిబ్రవరి 1న కింగ్స్‌మీడ్‌ మైదానంలో జరుగనుంది.

మరిన్ని వార్తలు