ఐపీఎల్‌ ఫైనల్‌: ముంబైదే బ్యాటింగ్‌

12 May, 2019 19:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2019 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ వేశారు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న ఈ ఫైనల్‌ పోరులో టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ ఒక మార్పు చేసింది. స్పిన్నర్‌ జయంత్‌ యాదవ్‌ను పక్కకుపెట్టిన ముంబై మిచెల​ మెక్లీన్‌గాన్‌కు అవకాశం కల్పించింది. ఫైనల్‌ పోరుకు సీఎస్‌కే ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. అయితే టాస్‌ అనంతరం ధోని మాట్లాడుతూ.. తాము టాస్‌ గెలిచినా ముందు బౌలింగే ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. దీంతో మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ రేపుతోంది.   

తుదిజట్లు: 
ముంబై: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషాన్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండా​, పొలార్డ్‌, మిచెల్‌ మెక్లీన్‌గాన్‌, రాహుల్‌ చహర్‌, బుమ్రా, మలింగ

సీఎస్‌కే: ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), డుప్లెసిస్‌, వాట్సన్‌, రైనా, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, డ్వేన్‌ బ్రేవో, దీపక్‌ చహర్‌, హర్భజన్‌ సింగ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌

Liveblog

మరిన్ని వార్తలు