ఏప్రిల్‌ 9 నుంచి హైదరాబాద్‌లో ఐపీఎల్‌ షో

15 Feb, 2018 10:17 IST|Sakshi
ఉప్పల్‌ స్టేడియం(ఫైల్‌ఫొటో)

9న రాజస్తాన్‌తో సన్‌రైజర్స్‌ తొలి మ్యాచ్‌  

ఉప్పల్‌ వేదికగా మొత్తం 7 మ్యాచ్‌లు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఐపీఎల్‌ 11వ సీజన్‌ పోటీలు ఏప్రిల్‌ 9 నుంచి జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును లీగ్‌ పాలకమండలి బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్‌ 7న డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)ల మధ్య పోరుతో ఈ సీజన్‌ మొదలవుతుంది. వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది.  సీఎస్‌కేలాగే పునరాగమనం చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ తమ తొలి పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడుతుంది. ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఏప్రిల్‌ 9న ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ముంబైలోని వాంఖెడేలో ఆరంభ మ్యాచ్‌తో పాటు తొలి క్వాలిఫయర్‌ (మే 22), టైటిల్‌ పోరు (27న) కూడా జరుగనుంది. అయితే మ్యాచ్‌ల టైమింగ్‌లో ఏమార్పూ లేదు. ఒక మ్యాచ్‌ ఉంటే రాత్రి 8 గంటలకు, రెండు మ్యాచ్‌లుంటే మొదటి మ్యాచ్‌ సాయంత్రం 4 గంటలకు మొదలవుతాయి. ఈ మ్యాచ్‌లన్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఇంతకుముందు సాయంత్రం మ్యాచ్‌ను 5 గంటల నుంచి, రాత్రి మ్యాచ్‌ను 7 గంటల నుంచి నిర్వహించాలనే ప్రతిపాదనలువచ్చాయి. కానీ విజయవంతమైన పది సీజన్లలాగే మ్యాచ్‌ టైమింగ్‌ను ఖరారు చేశారు.

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ షెడ్యూలు

ఏప్రిల్‌ 9    రాజస్తాన్‌ రాయల్స్‌    రా.గం. 8
ఏప్రిల్‌ 12    ముంబై ఇండియన్స్‌    రా.గం. 8
ఏప్రిల్‌ 22    చెన్నై సూపర్‌కింగ్స్‌    సా.గం. 4
ఏప్రిల్‌ 26     కింగ్స్‌పంజాబ్‌              రా.గం. 8
మే 5    ఢిల్లీ డేర్‌డెవిల్స్‌               రా.గం. 8
మే 7    బెంగళూరు               రా.గం.8
మే 19    కోల్‌కతా నైట్‌రైడర్స్‌    రా.గం.8  

మరిన్ని వార్తలు