ప్రపంచకప్ గ్రూప్-బిలో భాగంగా బుధవారం యూఏఈ, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ 20 ఓవర్లు ముగిసే సరికి ఇర్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులుచేసింది. యూఏఈ నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యఛేదనలో ఇర్లాండ్ నెమ్మదిగా ఆడుతోంది. రెండో ఓవర్లో ఐరిష్ బ్యాట్స్ మన్ స్టెర్లింగ్ ను గురుగె ఔట్ చేశాడు. 37 పరుగులుచేసిన జాయ్ సీ.. జావెద్ విసిరిన 18వ ఓవర్లో కీపర్ పాటిల్ కు సునాయాస క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విజయం కోసం ఐర్లాండ్ 30 ఓవర్లలో ఇంకా 202 పరుగులు చేయాల్సి ఉంది.