విక్రమ్‌ సినిమాతో తెరంగేట్రం చేయనున్న పేస్‌ బౌలర్‌

14 Oct, 2019 21:35 IST|Sakshi

రాంచి : టీమిండియా పేస్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టనున్నాడు. తమిళ సూపర్‌స్టార్‌ విక్రమ్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇర్ఫానే స్వయంగా ట్విటర్‌లో పేర్కొన్నాడు. అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్‌ తెరంగేట్రం చేయబోతున్నట్టు తెలిసింది. ఙ్ఞానముత్తు ఇదివరకు డిమొంటే కాలనీ, ఇమైక్క నొడిగల్‌ సినిమాలకు దర్శకత్వం వహించారు. 

అయితే, ఈ సినిమాలో ఏ రకమైన పాత్ర పోషించబోతున్నదీ ఇర్ఫాన్‌ వెల్లడించలేదు. ఇక ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై సినిమా నిర్మాణం జరుగునున్నట్టు సమాచారం. కాగా, 2012లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌ ఇర్ఫాన్‌ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌. ఇక దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో ఇర్ఫాన్‌ ఎక్స్‌పర్ట్‌ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్నాడు.

మరిన్ని వార్తలు