మెల్బోర్న్: భారత్ తో జరగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు సెంటిమెంట్ కలిసొస్తుందా, లేదా అనేది నేడు తేలనుంది. నేడు జరగనున్న మ్యాచ్ బంగ్లాకు 300వ వన్డే. గతంలో భారత్పై 100వ, 150వ మ్యాచ్లు ఆడినప్పుడు ఆ జట్టు గెలిచింది. టీమిండియా లాంటి బలమైన జట్టుపై విజయం సాధించాలంటే బంగ్లాకు సెంటిమెంట్ తో పాటు సర్వశక్తులు ఒడ్డాలి.
డబుల్ హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న ధోని సేన జైత్రయాత్రను అడ్డుకుని తమది గాలివాటం కాదని నిరూపించాలని బంగ్లా టీమ్ పట్టుదలతో ఉంది. అయితే బంగ్లా బేబీలనూ బాదేసి సెమీస్ లో అడుగు పెట్టాలని టీమిండియా భావిస్తోంది.