అది అంత ఈజీ కాదు: దినేశ్ కార్తీక్

10 Nov, 2017 12:48 IST|Sakshi

న్యూఢిల్లీ:అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల్లో పునరాగమనం చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నదని అంటున్నాడు టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తీక్. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఆకట్టుకున్న దినేశ్ కార్తీక్.. ఒక జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదని అభిప్రాయానికి వచ్చేశాడు.

'అంతర్జాతీయ మ్యాచ్ ల్లో పునరాగమనం అనేది ఎప్పుడూ కష్టమే. మనం మొదటిసారి జట్టులో అరంగేట్రం చేసిన దాని కంటే తిరిగి జట్టులో సంపాదించడమే చాలా కష్టం. చాలా కాలం తరువాత నీవు ఎప్పుడైతే భారత జట్టు ఎలెవన్ లో భాగం అవుతావో.. అప్పుడు మానసికంగా చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది. నిన్ను నీవు నిరూపించుకోవడానికి మానసిక ఒత్తిడిని జయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను మంచి పొజిషన్ లోనే ఉన్నానని అనుకుంటున్నా. న్యూజిలాండ్ తో సిరీస్ లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా'అని కార్తీక్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు