గ్రేటర్ నోయిడా: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా బ్లూ జట్టుకు తొలి ఇన్నింగ్సలో 338 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఇండియా రెడ్ జట్టు 98.1 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. బిన్నీ (159 బంతుల్లో 98; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్సను ప్రారంభించిన ఇండియా బ్లూ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 1 పరుగు చేసింది.