పాక్తో సిరీస్కు అండర్సన్ అనుమానం!

26 Jun, 2016 20:32 IST|Sakshi

లండన్: త్వరలో పాకిస్తాన్ తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్కు ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవల శ్రీలంకతో జరిగిన చివరి టెస్టులో అండర్సన్ గాయపడటంతో తదుపరి పాకిస్తాన్ సిరీస్లో పాల్గొనడం అనుమానంగా మారింది. అతని భుజానికి గాయం కావడంతో పాకిస్తాన్తో టెస్టు సిరీస్కు అండర్సన్ అందుబాటులో ఉండకపోవచ్చని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

 

'అండర్సన్ కుడి భుజానికి గాయమైంది. గత నెల్లో శ్రీలంకతో టెస్టు మ్యాచ్లో అతను గాయపడ్డాడు. అయితే సాధారణ గాయం కావడంతో పాక్ తో సిరీస్ నాటికి అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాం. పాకిస్తాన్ తో సిరీస్ కు ఇంకా సమయమున్నందున అప్పటికి అండర్సన్ కోలుకోవచ్చు. లేని పక్షంలో సిరీస్కు దూరం కావచ్చు'అని ఇంగ్లిష్ బోర్డు తెలిపింది. వచ్చే నెల 14    వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య  టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు