వన్డేలకూ బుమ్రా దూరం... శార్దుల్‌ ఠాకూర్‌కు స్థానం

7 Jul, 2018 02:12 IST|Sakshi

చేతి వేలికి గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టి20 సిరీస్‌కు దూరమైన భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఇప్పుడు వన్డే సిరీస్‌ నుంచి కూడా తప్పుకున్నాడు. అనుకున్న సమయానికి గాయం తగ్గకపోవడమే అందుకు కారణం. బుధవారం లీడ్స్‌లో అతను వేలికి శస్త్ర చికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చింది.

అనంతరం వైద్యుల పర్యవేక్షణ, విశ్రాంతి కోసం బుమ్రా భారత్‌కు తిరిగొచ్చాడు. బుమ్రా స్థానంలో వన్డే జట్టులోకి శార్దుల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. భారత్‌ తరఫున 3 వన్డేలు ఆడిన శార్దుల్‌ 5 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా గాయం తీవ్రతను బట్టి చూస్తే ఆగస్టు 1 నుంచి జరిగే తొలి టెస్టు సమయానికి కూడా అతను కోలుకోవడం సందేహంగా కనిపిస్తోంది.    

మరిన్ని వార్తలు