ఉత్తమ క్రీడాకారుడిగా జీతూ రాయ్

8 May, 2015 01:34 IST|Sakshi

న్యూఢిల్లీ : ఈ ఏడాది టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల్లో... మేటి షూటర్ జీతూ రాయ్ ఉత్తమ క్రీడాకారుడిగా నిలిచాడు. ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్‌కు ‘జీవితకాల సాఫల్య పురస్కారం’ లభించింది. వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అథ్లెట్లకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. యూత్ ఐకాన్ పురస్కారాన్ని సైనా నెహ్వాల్ గెలుచుకోగా, బ్యాడ్మింటన్‌లో పి.వి.సింధు, టెన్నిస్‌లో సానియా మీర్జాలు ఉత్తమ క్రీడాకారిణిలుగా ఎంపికయ్యారు.

మరిన్ని వార్తలు