దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ విజయం

22 Jun, 2017 12:40 IST|Sakshi

సౌంతాప్టన్: మూడు ట్వంటీ 20ల సిరీస్ లోభాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విసిరిన 143 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ వికెట్ మాత్రమే కోల్పోయి 33 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. ఇంగ్లండ్ విజయంలో హేల్స్(47 నాటౌట్;38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్ స్టో(60 నాటౌట్; 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) లు ముఖ్యపాత్ర పోషించారు.

సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను జాసన్ రాయ్, హేల్స్ లు ప్రారంభించారు.  ఇంగ్లండ్ స్కోరు 45 పరుగుల వద్ద జాసన్ రాయ్ (28) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో హేల్స్ తో జతకలిసిన బెయిర్ స్టో ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ జోడి 98 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేసి భారీ విజయంలో సహకరించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్(65నాటౌట్; 58 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెహర్దియన్(64 నాటౌట్; 52 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు.

 

మరిన్ని వార్తలు