సెమీస్‌లో జోష్నా

30 Sep, 2016 23:59 IST|Sakshi

ముంబై: ఇండియన్ స్క్వాష్ సర్క్యూట్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు జోష్నా చిన్నప్ప, దీపిక పళ్లికల్‌లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. జోష్నా సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... దీపిక క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి0ది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో జోష్నా 11-7, 5-11, 11-5, 11-5తో లియు లింగ్ (హాంకాంగ్)పై గెలుపొందగా... దీపిక 13-15, 11-8, 10-12, 8-11తో టెస్నీ ఇవాన్‌‌స (వేల్స్) చేతిలో ఓడిపోయి0ది.  
 

మరిన్ని వార్తలు