సెమీస్‌లో గాయత్రి గోపీచంద్

31 Jul, 2016 09:26 IST|Sakshi

రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గాయత్రి గోపీచంద్ (రంగారెడ్డి) సెమీఫైనల్స్‌కు చేరుకుంది. శనివారం జరిగిన అండర్-17 బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి 21-7, 21-3తో తనుశ్రీ (వరంగల్)ని చిత్తుగా ఓడించింది. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో మేఘనా రెడ్డి (హైదరాబాద్) 21-12, 18-21తో అభిలాష (హైదరాబాద్)పై, కేయూర 21-15, 21-16తో భార్గవి (రంగారెడ్డి)పై, సామియా ఫరూఖి (రంగారెడ్డి) 21-5, 23-21తో ప్రవళిక (మెదక్)పై గెలుపొందారు.

బాలుర సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో శ్రీకృష్ణ (రంగారెడ్డి) 21-10, 21-13తో మహితేజ (హైదరాబాద్)పై, పవన్ కృష్ణ (ఖమ్మం) 21-17, 21-10తో భవధీర్ (హైదరాబాద్)పై, విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) 21-17, 21-14తో రితిన్ (వరంగల్)పై విజయం సాధించారు.
 

మరిన్ని వార్తలు