జూనియర్ హాకీ జట్టు శుభారంభం

24 Jul, 2016 15:33 IST|Sakshi

మార్లో (ఇంగ్లండ్): ఇంగ్లండ్ పర్యటనలో భారత జూనియర్ హాకీ జట్టు శుభారంభం చేసింది. శనివారం ఇక్కడి బిషమ్ అబే స్పోర్ట్స్ సెంటర్ లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది.

 

భారత్ తరఫున నీలకంఠ, సిమ్రన్‌జీత్ గోల్స్ చేయగా... విలియం మార్షల్ స్కాట్లాండ్‌కు ఏకైక గోల్‌ను అందించాడు. ఈ మ్యచ్‌లో భారత్ ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

మరిన్ని వార్తలు