మూడో రౌండ్‌లో జ్యోతి సురేఖ 

25 Apr, 2018 01:35 IST|Sakshi

షాంఘై (చైనా): ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌడ్‌ వ్యక్తిగత విభాగం రెండో రౌండ్‌లో సురేఖ 145–140తో లెక్సీ కెల్లర్‌ (అమెరికా)పై విజయం సాధించింది.  

మరిన్ని వార్తలు