ఆసియా క్రీడలకు జ్యోతి సురేఖ 

16 Jun, 2018 01:09 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందంలో ఆర్చర్‌ జ్యోతి సురేఖకు చోటుదక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఆగస్టు 19 నుంచి ఇండోనేసియాలోని జకర్తా వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో బరిలో దిగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనడం ఆమెకు ఇది రెండోసారి.

ఆసియా క్రీడలకు ముందు సురేఖ జూన్‌ 19 నుంచి అమెరికాలో జరిగే ప్రపంచకప్‌ స్టేజ్‌–3, జూలై 16 నుంచి జర్మనీలో జరిగే వరల్డ్‌కప్‌ స్టేజ్‌–4 పోటీల్లో పాల్గొననుంది.   

మరిన్ని వార్తలు