నేడు ఆల్‌స్టార్స్‌ కబడ్డీ మ్యాచ్‌

13 Jul, 2019 05:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఏడో సీజన్‌ ఈనెల 20న ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు ఓ ఆసక్తికర మ్యాచ్‌ కు రంగం సిద్ధం చేశారు. జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుల మధ్య ఆల్‌స్టార్‌ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు మషాల్‌ స్పోర్ట్స్‌ పేర్కొంది. వరల్డ్‌–7, ఇండియన్‌–7 జట్ల మధ్య నేడు జరుగనున్న ఈ మ్యాచ్‌కు గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. వరల్డ్‌ జట్టుకు ఫజల్, భారత జట్టుకు అజయ్‌ ఠాకూర్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

జట్ల వివరాలు
ఇండియన్‌–7: మణీందర్, పవన్, రవీంద్‌ పహాల్, వికాస్, సునీల్, దీపక్‌ హుడా, పర్దీప్‌ నర్వాల్, గిరీశ్, సుర్జీత్, అజయ్‌ ఠాకూర్‌ (కెప్టెన్‌), సందీప్‌ నర్వాల్, నితీశ్, బల్వాన్‌ సింగ్‌ (కోచ్‌).
వరల్డ్‌–7: ఇస్మాయిల్, లాల్‌మనోహర్, గఫారి, టిన్‌ పోన్‌చో, షాజిద్, డాంగ్‌ యు కిమ్, జాంగ్‌ కున్‌ లీ, ఎమాద్, అబోజర్, ఫర్హాద్, ఫజల్, మసూర్‌ కరీమ్, ఈపీ రావు (కోచ్‌).  

మరిన్ని వార్తలు