స్వర్ణంతో మెరిసిన కరణ్‌

6 Apr, 2019 16:30 IST|Sakshi

తైక్వాండో చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: ఏయూ తైక్వాండో అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లో వైఎంసీఏ నారాయణగూడ యామగుచి తైక్వాండో అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో యామగుచి ప్లేయర్లు 3 పతకాలను సాధించారు. అకాడమీకి చెందిన కరణ్‌ స్వర్ణంతో మెరవగా... ఎస్‌.ఎన్‌. పూజ, మహాదేవ్‌ చెరో రజత పతకాన్ని గెలుచుకున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను యామగుచి తైక్వాండో అకాడమీ శుక్రవారం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షులు ఆర్‌కే కృష్ణ, ఉపాధ్యక్షులు స్వప్నారెడ్డి, కార్యదర్శులు పి. సంధ్య స్మిత, బీజే వినయ్‌ స్వరూప్, కోచ్‌ డి. విశ్వనాథ్‌ పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు