‘ఇంగ్లండ్‌ క్రికెట్‌ పయనం అర్థం కావడం లేదు’

10 Jun, 2018 10:46 IST|Sakshi

లండన్‌: వన్డేలపైనే పూర్తిగా దృష్టిసారిస్తూ.. టెస్టు క్రికెట్‌ను నిర్లక్ష్యం చేస్తు న్నదంటూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)పై ఆ దేశ మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ విమర్శలు గుప్పించాడు. రెండేళ్లుగా వన్డేల్లో మెరుగ్గా రాణిస్తున్న ఇంగ్లండ్‌.. యాషెస్‌, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లను చేజార్చుకుంది. ఇటీవల సొంతగడ్డపై పాకిస్తాన్‌తో రెండుటెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ పయనం తనకు అర్థం కావడంలేదన్న పీటర్సన్‌.. వరల్డ్‌కప్‌ కోసం టెస్టులను పణంగా పెడుతున్నారన్నాడు. ఇది ఎంతమాత్రం సరైన విధానం కాదన్నాడు. అసలు వారు ఏ మార్గదర్శకత్వంలో ముందుకు వెళుతున్నారో తనకు బోధ పడటం లేదన్నాడు.

మరిన్ని వార్తలు