కింగ్స్‌తో మ్యాచ్‌: ముంబై బ్యాటింగ్‌

30 Mar, 2019 15:59 IST|Sakshi

మొహాలి: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ముందుగా ముంబైను  బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ లీగ్‌లో ఇప్పటివరకూ ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలిచాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కింగ్స్‌ పంజాబ్‌ ఐదో స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్‌ ఆరో స్థానంలో ఉంది.

తుది జట్లు..

కింగ్స్‌ పంజాబ్‌
రవి చంద్రన్‌ అశ్విన్(కెప్టెన్‌)‌, కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, డేవిడ్‌ మిల్లర్‌, మన్‌దీప్‌ సింగ్‌, హార్దుస్‌ విల్జోయిన్‌, మురుగన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ, ఆండ్రూ టై

ముంబై ఇండియన్స్‌

రోహిత్‌ శర‍్మ(కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, డీకాక్‌, యువరాజ్‌ సింగ్‌, పొలార్డ్‌, కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా, మెక్లీన్‌గాన్‌, మయాంక్‌ మార్కండే, బుమ్రా, లసిత్‌ మలింగా

Liveblog

మరిన్ని వార్తలు