భారత్‌ ‘ఎ’ 219/1 

9 Feb, 2019 03:32 IST|Sakshi

వాయనాడ్‌ (కేరళ): ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ దీటైన జవాబు ఇచ్చింది. రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 219 పరుగులు సాధించింది. లోకేశ్‌ రాహుల్‌ (88 బ్యాటింగ్‌; 11 ఫోర్లు), ప్రియాంక్‌ పాంచల్‌ (89 బ్యాటింగ్‌; 16 ఫోర్లు) రెండో వికెట్‌కు అజేయంగా 171 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 303/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ లయన్స్‌ 340 పరుగుల వద్ద ఆలౌటైంది. నవదీప్‌ సైనికి ఐదు వికెట్లు లభించాయి. 

మరిన్ని వార్తలు