టాప్‌లోనే విరాట్‌ కోహ్లి

13 Nov, 2018 16:17 IST|Sakshi

దుబాయ్‌: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ,  పేసర్‌ జస్ప్రిత్‌ బూమ్రలు వన్డే ర్యాంకింగ్స్‌లో తమ అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నారు. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో వీరిద్దరూ టాప్‌ను నిలబెట్టుకున్నారు. కాగా, బ్యాటింగ్‌ విభాగంలో రోహిత్‌ శర్మ రెండో స్థానానికి చేరాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి 899 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ను పదిలం చేసుకోగా, రోహిత్‌ శర్మ 871 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు.

బౌలింగ్‌ విభాగంలో బూమ్రా 841 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 723 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మరో స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్ మూడో స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్‌ విభాగంలో రషీద్‌ ఖాన్‌ టాప్‌లోనే కొనసాగుతున్నాడు. వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ జట్టు రెండో స్థానాన్ని నిలుపుకోగా, ఇంగ్లండ్‌ అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.

మరిన్ని వార్తలు