ఆసీస్‌తో రెండో వన్డే: కోహ్లి హాఫ్‌ సెంచరీ

5 Mar, 2019 15:24 IST|Sakshi

నాగ్‌పూర్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ సాధించాడు. కోహ్లి 55 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. అయితే రోహిత్‌ డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో భారత జట్టు పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్‌ను నష్టపోయింది.

ఆపై ధావన్‌-కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 38 పరుగుల జత చేసిన తర్వాత ధావన్‌(21) రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో ధావన్‌ ఎల్బీగా ఔటయ్యాడు. ఆపై అంబటి రాయుడుతో కలిసి కోహ్లి మరో 37 పరుగులు జత చేశాడు. కాగా, రాయుడు(18) మూడో వికెట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తరుణంలో కోహ్లి-విజయ్‌ శంకర్‌ జంట ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. ఈ క్రమంలోనే కోహ్లి హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. భారత జట్టు 27 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు