కోల్కతా మూడో విజయం

20 Apr, 2015 23:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్-8లో కోల్కతా మరో విజయం నమోదు చేసింది. సోమవారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో కోల్కతా 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో కోల్కతాకిది మూడో విజయం కాగా ఓ మ్యాచ్లో ఓడింది. ఢిల్లీకిది మూడో పరాజయం కాగా రెండు మ్యాచ్ల్లో నెగ్గింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్కతా 4 వికెట్లు కోల్పోయి మరో11 బంతులు మిగిలుండగా అలవోకగా విజయతీరాలకు చేరింది. గంభీర్ (60) హాఫ్ సెంచరీకి తోడు యూసుఫ్ (40 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్ ముత్తుస్వామి రెండు వికెట్లు తీశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు చేసింది. మనోజ్ తివారి 32, శ్రేయాస్ అయ్యర్ 31, మాథ్యూస్ 28, యువరాజ్ సింగ్ 21 పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లు చావ్లా, ఉమేష్ యాదవ్, మోర్నీ మోర్కెల్ రెండేసి వికెట్లు తీశారు.
 

మరిన్ని వార్తలు