కాన్పూర్: ఐపీఎల్లో భాగంగా గురువారం ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియంలో గుజరాత్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్లో తడబడింది. రాబిన్ ఉతప్ప(25), యూసఫ్ పఠాన్(36)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో కోల్ కతా 125 పరుగుల సాధారణ లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించకల్గింది.
కీలక మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా ఆదిలోనే గౌతం గంభీర్(8)వికెట్ను నష్టపోయింది. అనంతరం మనీష్ పాండే(1) వెంటనే పెవిలియన్ కు చేరడంతో కోల్ కతా కష్టాలు ఆరంభమయ్యాయి. ఓ వైపు ఉతప్ప జట్టు ఇన్నింగ్స్కు మరమ్మత్తులు చేపట్టినా ఎక్కువ సేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. కోల్ కతా స్కోరు 44 పరుగుల వద్ద ఉతప్ప మూడో వికెట్ అవుట్ కావడంతో స్కోరు బోర్డు మందగించింది. ఆ తరువాత పీయూష్ చావ్లా(11), షకిబుల్ హసన్(3), సూర్య కుమార్ యాదవ్(17) లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో కోల్ కతా తేరుకోలేకపోయింది. ఇన్నింగ్స్ చివర్లో యూసఫ్ పఠాన్, జాసన్ హోల్డర్(13 ) పరుగు తేడాలో నిష్క్రమించడంతో కోల్ కతా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. గుజరాత్ లయన్స్ బౌలర్లలో డ్వేన్ స్మిత్ నాలుగు వికెట్లతో కోల్ కతా పతనాన్నిశాసించగా, డ్వేన్ బ్రేవో, జకాతి, కులకర్ణిలకు తలో వికెట్ దక్కింది.