హంపీ పెళ్లంట

31 May, 2014 08:38 IST|Sakshi
హంపీ పెళ్లంట

విజయవాడ : చెస్ క్వీన్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి వధువు కాబోతోంది. ఆగస్టు 14వ తేదీ తెల్లవారుజామున దాసరి అన్వేష్‌ను పరిణయమాడబోతోంది. ఎఫ్‌ట్రానిక్స్ (విజయవాడ) కంపెనీ అధినేత దాసరి రామకృష్ణారావు ఏకైక కుమారుడు అన్వేష్‌తో ఈ నెల 22న ఓ హోటల్‌లో  అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగింది. తమ ఇద్దరి రంగాలు వేరైనా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతామని హంపి తెలిపింది. పెళ్లి తర్వాత కూడా చెస్‌లో కొనసాగుతానని పేర్కొంది.
 

 

మరిన్ని వార్తలు