ఐటీఎఫ్ సీనియర్ టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సీనియర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ కేవీఎన్ మూర్తి విజేతగా నిలిచాడు. నేపాల్లో ఆదివారం జరిగిన 45 ప్లస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూర్తి 6–4, 6–1తో అమ్రిత్ బహదూర్ (నేపాల్)పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో యూఎస్ఏలో ఈనెల 21 నుంచి 26 వరకు జరుగనున్న ఐటీఎఫ్ యంగ్ సీనియర్స్ ప్రపంచ టీమ్ చాంపియన్షిప్ టోర్నీలో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యాడు.