మ్యాచ్‌కు వెళుతూ కింగ్స్‌ పంజాబ్ ఇలా.. వైరల్‌

8 Apr, 2018 15:43 IST|Sakshi

మొహాలీ: జట్టు పేరుకు తగ్గట్టే స్థానిక సంస్కృతుల్ని ప్రదర్శించడంలో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ యాజమాన్యం మిగతా ఫ్రాంచైజీలతో పోటీపడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో సొంత గడ్డపై తొలి మ్యాచ్‌ సందర్భంగా ఇటు ఆటగాళ్లు బసచేసిన హోటల్‌ వద్ద, అటు స్టేడియం వద్ద బ్యాండ్ల సందడి నెలకొంది. ఐపీఎల్‌ 2018లో భాగంగా ఆదివారం సాయంత్రం కింగ్స్‌ పంజాబ్‌-ఢిల్లీ డేర్‌డెవిల్స​ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌ ఆడేందుకుగానూ హోటల్‌ నుంచి స్టేడియంకు బయలుదేరిన ఆటగాళ్లు ఇదిగో ఇలా పంజాబీ బీట్స్‌కు అనుగుణంగా స్టెప్స్‌ వేశారు. తొలుత యువరాజ్‌, ఆ తర్వాత మిల్లర్‌, ఇంకొందరు ఆటగాళ్లు డ్యాన్స్‌ చేస్తూ సందడి చేసిన ఈ ‘బల్లే బల్లే’ వీడియోలను కింగ్స్‌ అఫీషియల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు