టైటాన్స్‌ను గెలిపించిన  రాహుల్‌ చౌదరి

14 Dec, 2018 03:14 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై చివరి మ్యాచ్‌ను తెలుగు టైటాన్స్‌ విజయంతో ముగించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 41–36తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి 12 పాయింట్లతో చెలరేగగా... నీలేశ్‌ 9, మోసిన్‌ 5 పాయింట్లు సాధించారు. పట్నా పైరేట్స్‌ తరఫున ‘డుబ్కీ’కింగ్‌ ప్రదీప్‌ నర్వాల్‌ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. జోన్‌ ‘బి’లో ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్‌ 8 మ్యాచ్‌ల్లో గెలిచి 50 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో పుణేరి పల్టన్, బెంగాల్‌ వారియర్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ తలపడనున్నాయి. వైజాగ్‌లో మ్యాచ్‌లు ముగియగా... శుక్రవారం నుంచి పోటీలు హరియాణాలోని పంచకులలో జరుగనున్నాయి.

>
మరిన్ని వార్తలు