గంభీర్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు..

16 Nov, 2019 11:59 IST|Sakshi

ఇండోర్‌: ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే గౌతమ్‌ గంభీర్‌ను అతడి మాజీ సహచరుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ నవ్వుల్లో ముంచెత్తాడు. భారత్‌-బంగ్లాదేశ్‌ తొలి టెస్ట్‌ రెండోరోజు ఆట సందర్భంగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. గంభీర్‌, లక్ష్మణ్‌తోపాటు స్టార్‌స్పోర్ట్స్‌ కామెంటేటర్‌ జతిన్‌ సప్రు శుక్రవారం ఇండోర్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు.

అక్కడ వారు ఓ చాట్‌ భండార్‌లో  జిలేబీ తింటూ ఆహ్లాదంగా గడిపారు.  దీనికి సంబంధించి ఫోటోను వీవీఎస్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. ‘అటుకుల వంటకంతో కారంకారంగా.. జిలేబీతో తియ్యని బ్రేక్‌ఫాస్ట్‌తో ఇండోర్‌లో ఈరోజు అద్భుతంగా మొదలైంది’ అని లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశాడు. దీనిపై నెటిజన్లు సరదాగా స్పందించారు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే గౌతం గంభీర్‌ నవ్వడమా.. అది కూడా పెద్దగా నవ్వడమంటే ‘ మిషన్‌ ఇంపాసిబుల్‌’ పాసిబుల్‌ అయ్యింది అంటూ ఒక నెటిజన్‌ ట్వీట్‌ చేయగా, గంభీర్‌ ఇలా నవ్వడం మొదటిసారి చూశానని మరొకరు ట్వీట్‌ చేశారు. ‘అసలు గంభీర్‌ నవ్వి ఎంతకాలమైందో’ అని ఒకరు ట్వీట్‌ చేయగా, ‘గంభీర్‌ ఇలానే నవ్వుతూ ఉండు’ అని మరొకరు పేర్కొన్నారు.(ఇక‍్కడ చదవండి: వారికి అదే సమాధానం చెబుతుంది: గంభీర్‌)


 

మరిన్ని వార్తలు