ఆసీస్ బౌలర్ ఆస్టన్ ఏగర్
చెన్నై: భారత్తో జరగబోయే ఐదు వన్డేల సిరీస్లో లెగ్ స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ ఏగర్ అభిప్రాయపడ్డాడు. భారత్లో ఈ తరహా బౌలర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ ఉండగా ఆసీస్ జట్టులో ఆడమ్ జంపా ఉన్నాడు. ‘వన్డేల్లో లెగ్గీస్ పాత్ర చాలా విలువైనది. ఎందుకంటే వారు బంతిని రెండు వైపులా స్పిన్ చేయగలరు.
ఇప్పుడు రెండు జట్లలో ముగ్గురు ఇలాంటి బౌలర్లు ఉన్నారు. సిరీస్లో వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వారికి స్పిన్కు అనుకూలించే పిచ్లు కూడా అవసరం లేదు. ఈ త్రయం పరిస్థితులకు తగ్గట్టుగా చాలా తెలివిగా బౌలింగ్ చేయగలదు’ అని ఆల్రౌండర్గా రాణిస్తున్న ఏగర్ తెలిపాడు..