‘ఎక్కువ ఆలోచనే అనవసరం.. ఉరి తీయండి’

1 Dec, 2019 12:58 IST|Sakshi

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు సైతం స్పందించాడు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్వీటర్‌ అకౌంట్‌లో ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం చాలా దారుణమని, ఇది మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

అంబటి రాయుడు కూడా ఈ పాశవిక ఘటనపై తీవ్రంగా మండిపడ్డాడు. దీనికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని, అత్యాచార నిందితుల్ని ఉరి తీయాల్సిందేనని ట్వీటర్‌లో పేర్కొన్నాడు. ‘ ఎవరైనా మహిళ శరీరాన్ని దోచుకోవాలని ఆలోచించే వారికి ఇదొక కనువిప్పు కావాలి. వారి మెడలను గట్టిగా బిగించి ఉరి తీయండి. ఇందుకు ఎక్కువ ఆలోచన అవసరం లేదు. ఉరే సరైనది’ అని అంబటి రాయుడు ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు